దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Update: 2020-12-30 02:00 GMT

దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ వద్ద చారిత్రక అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయ గాలిగోపురం కూలిపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఈవోకు ఫోన్‌ చేసి మాట్లాడారు. చారిత్రక ఆలయం ధ్వంసం అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు.


Tags:    

Similar News