హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో జర్నీ చేశారు.పవన్తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు పవన్. అలాగే మెట్రోలో ద్రాక్షారామం రైతులతో కూడా ఆయన మాట్లాడారు. మెట్రోలో ప్రయాణించడం ఇదే తొలిసారి అన్నారు పవన్ కల్యాణ్.