REVANTH: 3, 4 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

Update: 2025-11-25 03:00 GMT

మరో 3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని.. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటి సెంట్రలైజ్డ్ కిచెన్‌ను నేడు ప్రారంభించారు. కొడంగల్‌లోని ఎంకేపల్లి వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక కిచెన్‌ను అక్షయ పాత్ర ఫౌండేషన్ (హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో నిర్మించారు. ఈ కేంద్రం నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 28,000 మంది విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సరఫరా కానుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ నమోదవుతున్న ఆహార విషప్రయోగ కేసుల నేపథ్యంలో, ఈ పైలట్ ప్రాజెక్ట్ విద్యార్థులకు హైజెనిక్‌గా, పోషకాహారం అధికంగా ఉన్న ఆహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఏ విద్యార్థి ఆకలితో ఉండొద్దనే..

కొ­డం­గ­ల్‌­లో ఏ వి­ద్యా­ర్థీ ఆక­లి­తో ఉం­డ­కూ­డ­ద­న్న లక్ష్యం­తో ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి వి­వ­రిం­చా­రు. ప్ర­స్తు­తం ని­యో­జ­క­వ­ర్గం­లో 28 వేల మం­ది­కి ఉదయం అల్పా­హా­రం అం­ది­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. దీం­తో ప్ర­భు­త్వ బడు­ల్లో 5 వేల మంది వి­ద్యా­ర్థు­లు పె­రి­గా­ర­ని ఆయన తె­లి­పా­రు. ఢి­ల్లీ­కి నో­యి­డా ఎలా­గో...  తె­లం­గా­ణ­కు కొ­డం­గ­ల్‌ అలా­గే­న­ని రే­వం­త్‌ అన్నా­రు. లగ­చ­ర్ల పా­రి­శ్రా­మి­క­వా­డ­ను అం­త­ర్జా­తీయ స్థా­యి­లో తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని చె­ప్పా­రు. మద్దూ­రు మహి­ళా సమా­ఖ్య­కు చెం­దిన ఆర్టీ­సీ బస్సు­ను ప్రా­రం­భిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా ఏర్పా­టు చే­సిన సభలో సీఎం ప్ర­సం­గిం­చా­రు.  ‘‘కొ­డం­గ­ల్‌ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని లగ­చ­ర్ల­లో పా­రి­శ్రా­మి­క­వాడ ఏర్పా­టు­కు భూ­సే­క­ర­ణ­కు ప్ర­య­త్ని­స్తే కొం­ద­రు గి­ట్ట­ని­వా­రు రై­తు­ల­ను రె­చ్చ­గొ­ట్టా­రు. అధి­కా­రు­ల­పై దా­డు­లు చే­యిం­చి... వా­రి­పై కే­సు­ల­య్యే­లా చే­శా­రు. అన్న­దా­త­ల­తో మా­ట్లా­డి... పరి­హా­రం, ఇం­ది­ర­మ్మ ఇళ్లు కే­టా­యిం­చి లగ­చ­ర్ల, హకీం­పేట, పో­లే­ప­ల్లి­ల్లో మూడు వేల ఎక­రా­ల­ను సే­క­రిం­చాం.” అని రే­వం­త్ తె­లి­పా­రు.

తెలంగాణలో గత డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడం, పేద కుటుంబాల భారం తగ్గడం వంటి సానుకూల ఫలితాలు నమోదయ్యాయి. ఈ కొత్త సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News