అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య. బీజేపీ శ్రేణులతో కలిసి ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదన్న తేజస్విసూర్య.. తెలంగాణ ఉద్యమంలో యువత కీలకపాత్ర పోషించారని అన్నారు. ఎంతో మంది అమరుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో.. కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.