ఎస్పీబీ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

Update: 2020-09-25 09:32 GMT

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు... భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యా రని సీఎం అన్నారు. ఎస్పీ బాలు పాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమని అన్నారు. బాలసుబ్రమణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News