దళిత బంధు పథకం : తొలివిడతగా 500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలుకు నిధులు మంజూరు చేసింది.

Update: 2021-07-29 12:45 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలుకు నిధులు మంజూరు చేసింది. తొలివిడతగా 500 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత బడ్జెట్‌లో దళిత సాధికారతకు కేటాయించిన వెయ్యికోట్ల నుంచి ఈ నిధులను కేటాయించారు. పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు చేయనున్న సర్కారు.. ఇందు కోసం 20 వేల 929 కుటుంబాలను ఎంపిక చేసింది. మొదటి దశలో ఐదువేల కుటుంబాలకు 10 లక్షల చొప్పున తెలంగాణ సర్కారు పంపిణీ చేయనుంది.

Tags:    

Similar News