TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్

హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2025-09-23 05:30 GMT

తె­లం­గా­ణ­లో­ని సమ్మ­క్క­సా­గ­ర్ ప్రా­జె­క్ట్‌­కు ఎన్ఓ­సీ ఇచ్చేం­దు­కు ఛత్తీ­స్‌­గ­ఢ్ ప్ర­భు­త్వం అం­గీ­క­రిం­చిం­ది. రా­య్‌­పూ­ర్‌­లో ఛత్తీ­స్‌­గ­ఢ్‌ ము­ఖ్య­మం­త్రి వి­ష్ణు దేవ్ సా­యి­ని తె­లం­గాణ నీ­టి­పా­రు­దల శాఖ మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ కలి­శా­రు. నీట ము­ని­గే భూ­భా­గం పరి­హా­రం భరిం­చేం­దు­కు తె­లం­గాణ అం­గీ­కా­రం తె­లి­పిం­ది. ము­లు­గు జి­ల్లా­లో 6.7 టీ­ఎం­సీ సా­మ­ర్థ్యం­తో ఈ సమ్మ­క్క సా­గ­ర్ డ్యా­మ్ ని­ర్మా­ణం జరు­గు­తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఈ ప్రా­జె­క్టు వల్ల నల్గొండ, వరం­గ­ల్‌­లో తా­గు­నీ­టి సమ­స్య­ల­కు పరి­ష్కా­రం లభిం­చ­నుం­ది. రా­మ­ప్ప–పా­కాల లిం­క్ కె­నా­ల్ కింద కొ­త్త­గా 12,146 ఎక­రా­ల­కు నీరు అం­దు­తుం­ది. వరం­గ­ల్, సూ­ర్యా­పేట, మహ­బూ­బా­బా­ద్, జన­గాం, ఖమ్మం జి­ల్లా­ల­కు లబ్ధి చే­కూ­రు­తుం­ది. 90 కి­లో­మీ­ట­ర్ల టన్నె­ల్ నె­ట్‌­వ­ర్క్‌­తో భారీ ఇం­జ­నీ­రిం­గ్ డి­జై­న్ ఈ ప్రా­జె­క్టు ప్ర­త్యే­కత. మూడు పం­ప్‌­హౌ­సు­లు, క్రా­స్ డ్రె­యి­నే­జ్ వర్క్స్ ప్రా­జె­క్ట్‌­లో భా­గం­గా ఉన్నా­యి. పరి­హా­రం, పు­న­రా­వా­సం భరిం­చేం­దు­కు తె­లం­గాణ సి­ద్ధం అని మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి తే­ల్చి చె­ప్పా­రు.

సింగరేణి కార్మికులకు బోనస్‌

తె­లం­గాణ ప్ర­భు­త్వం దసరా సం­ద­ర్భం­గా సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు భారీ బో­న­స్‌ ప్ర­క­టిం­చిం­ది. లా­భా­ల్లో 34 శాతం కా­ర్మి­కు­ల­కు ఒక్కో­రు రూ.1,95,610 చె­ల్లిం­చ­ను­న్న­ట్లు సీఎం రే­వం­త్‌­రె­డ్డి, డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క తె­లి­పా­రు. 41,000 శా­శ్వత ఉద్యో­గు­ల­కు మొ­త్తం రూ.819 కో­ట్లు, 30,000 కాం­ట్రా­క్ట్‌ కా­ర్మి­కు­ల­కు రూ.5,500 ప్ర­తి వ్య­క్తి­కి బో­న­స్‌ ఇవ్వ­ను­న్నా­రు. కాం­ట్రా­క్ట్‌ కా­ర్మి­కు­ల­కు బో­న­స్‌ అం­దిం­చ­డం దేశ చరి­త్ర­లో­నే తొ­లి­సా­రి­గా జర­గ­డం అని భట్టి పే­ర్కొ­న్నా­రు. భవి­ష్య­త్తు­లో­నూ సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు అం­డ­గా ప్ర­భు­త్వం ఉం­టుం­ద­న్నా­రు. జీ­ఎ­స్టీ మా­ర్పుల వల్ల రా­ష్ట్ర ఆదా­యం కో­ల్పో­వ­డం, కేం­ద్రం వయ­బు­లి­టీ గ్యా­ప్‌ ఫం­డ్‌ ద్వా­రా ఈ లో­టు­ను భర్తీ చే­యా­ల­ని రే­వం­త్‌­రె­డ్డి సూ­చిం­చా­రు. సిం­గ­రే­ణి కా­ర్మి­కుల కష్టా­న్ని గు­ర్తిం­చి ప్ర­భు­త్వం ఇచ్చిన ఈ బో­న­స్‌ వారి ఆర్థిక భద్ర­త­కు తో­డ్ప­డు­తుం­ది. దీని ద్వా­రా కా­ర్మి­కు­లు దసరా పం­డు­గ­ను ఆనం­దం­గా జరు­పు­కు­నే అవ­కా­శం లభి­స్తుం­ది.

సింగరణి కార్మికులను మోసం చేసిన సర్కార్

మరో­సా­రి కా­ర్మి­కు­ల­ను రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వం దగా చే­సిం­ద­ని తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత ఆరో­పిం­చా­రు. ఈ మే­ర­కు ఆమె సో­మ­వా­రం ఎక్స్ వే­ది­క­గా తె­లి­పా­రు. 2024-25 సం­వ­త్స­రా­ని­కి 69.01 ఎంటీ బొ­గ్గు ఉత్ప­త్తి చే­య­డం­తో సిం­గ­రే­ణి­కి రూ.6 వేల కో­ట్ల నికర లా­భా­లు వస్తా­య­ని చె­ప్పా­ర­న్నా­రు. సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు సం­స్థ లా­భా­ల్లో 34 శాతం వాటా ఇస్తు­న్నా­మ­ని ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ద­ని, ఈ లె­క్కన సిం­గ­రే­ణి కా­ర్మి­కు­ల­కు లా­భాల బో­న­స్ రూ­పం­లో రూ. 2,040 కో­ట్లు ఇవ్వా­ల్సి ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఆడ­బి­డ్డ­ల­కు ఒకటి కాదు, రెం­డు చీ­ర­లి­స్తా­మ­ని గతం­లో చె­ప్పిం­ది. కానీ మొ­త్తా­ని­కే ఎగ్గొ­ట్టిం­ద­ని ఎద్దే­వా చే­శా­రు. ఆడ­బి­డ్డ­ల­ను గౌ­ర­విం­చ­ట­మం­టే కే­వ­లం బతు­క­మ్మ శు­భా­కాం­క్ష­లు చె­ప్ప­టం కాదు.. ఆడ­బి­డ్డ­ల­కు మాట ఇచ్చి­న­ట్లు నె­ల­కు రూ.2500 లతో పాటు, 18 ఏళ్లు నిం­డిన ఆడ­బి­డ్డ­లం­ద­రి­కీ స్కూ­టీ­లు ఇవ్వా­ల­ని డి­మాం­డ్ కల్వ­కుం­ట్ల కవిత చే­శా­రు.

Tags:    

Similar News