TG: సర్కార్ చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక

సీల్డ్ కవర్లో అందజేసిన జస్టిస్ పీసీ ఘోష్... కీలక అంశాలను ప్రస్తావించిన కమిషన్.. నివేదికలో 115 మంది సాక్ష్యాలు నమోదు;

Update: 2025-08-01 07:00 GMT

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు ని­ర్మా­ణం­లో అవ­క­త­వ­క­లు జరి­గా­య­ని ప్ర­భు­త్వం ని­య­మిం­చిన జస్టి­స్ పీసీ ఘోష్ కమి­ష­న్ ప్ర­భు­త్వా­ని­కి ని­వే­దిక సమ­ర్పిం­చిం­ది. కమి­ష­న్ కు ప్ర­భు­త్వం ఇచ్చిన గడు­వు చి­వ­రి రో­జున ని­వే­దిక సమ­ర్పిం­చి­ది. కే­సీ­ఆ­ర్ సహా..కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­లో పాలు పం­చు­కు­న్న కీ­ల­క­మైన వ్య­క్తు­లం­ద­రి వాం­గ్మూ­లు తీ­సు­కు­ని,రి­కా­ర్డు­లు పరి­శీ­లిం­చి జస్టి­స్ పీసీ ఘోష్ ని­వే­దిక సి­ద్ధం చే­శా­రు. 2023 డి­సెం­బ­ర్‌­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత, మే­డి­గ­డ్డ బ్యా­రే­జీ దె­బ్బ­తి­న­డం , ఇతర బ్యా­రే­జీ­ల­లో సీ­పే­జీ సమ­స్య­ల­పై వి­జి­లె­న్స్ వి­చా­రణ జరి­గిం­ది. వి­జి­లె­న్స్ ప్రా­థ­మిక ని­వే­ది­క­లో తీ­వ్ర­మైన ని­ర్మాణ లో­పా­లు గు­ర్తిం­చా­రు. అసెం­బ్లీ­లో చర్చ సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి న్యాయ వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చా­రు, దీని ఫలి­తం­గా కమి­ష­న్ ఏర్పా­టైం­ది.

15 నెలలపాటు విచారణ

కా­ళే­శ్వ­రం ఆన­క­ట్ట­ల­కు సం­బం­ధిం­చి వి­చా­రణ ని­వే­ది­క­ను జస్టి­స్‌ పీసీ ఘో­ష్‌ కమి­ష­న్‌ సమ­ర్పిం­చిం­ది. నీటి పా­రు­దల శాఖ ము­ఖ్య కా­ర్య­ద­ర్శి రా­హు­ల్‌ బొ­జ్జా­కు ని­వే­దిక అం­ద­జే­సిం­ది. 2024 మా­ర్చి 14న కమి­ష­న్‌­ను తె­లం­గాణ రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిం­ది. ఈ కమి­ష­న్‌ 15 నెలల పాటు మే­డి­గ­డ్డ, అన్నా­రం, సుం­ది­ళ్ల ఆన­క­ట్ట­ల­కు సం­బం­ధిం­చి వి­చా­రిం­చిం­ది. 115 మం­ది­ని వి­చా­రణ చేసి సా­క్ష్యా­లు నమో­దు చే­సిం­ది. కమి­ష­న్‌ ని­వే­ది­క­తో రా­హు­ల్‌ బొ­జ్జా సచి­వా­ల­యా­ని­కి చే­రు­కు­ని ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి రా­మ­కృ­ష్ణా­రా­వు­కు ని­వే­దిక అం­దిం­చా­రు. నివేదిక సమర్పణతో, ప్రభుత్వం దాని సిఫార్సులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై సిఫార్సులు ,సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చని భావిస్తున్నారు . కాళేశ్వరం అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మీద నేరుగా ఆరోపణలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మొత్తాన్ని కక్కిస్తామని.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదట కేబినెట్లో ఆమోదించి.. ఆ తర్వాత .. కేసులు నమోదు చేయడం , దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ప్రారంభించే అవకాశాలుఉన్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ నివేదిక తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది.

1000 పేజీల నివేదిక

బీ­ఆ­ర్‌­కే భవ­న్‌­కి వచ్చిన కమి­ష­న్‌ చై­ర్మ­న్‌ జస్టి­స్‌ పీసీ ఘో­ష్‌.. షీ­ల్డ్ కవ­ర్‌­లో రెం­డు డా­క్యు­మెం­ట్ల­ను ఇరి­గే­ష­న్ శాఖ ప్రి­న్సి­ప­ల్ సె­క్రె­ట­రీ రా­హు­ల్ బొ­జ్జ­కు అం­ద­జే­శా­రు. 500 పే­జీల చొ­ప్పున.. మొ­త్తం వె­య్యి పే­జీ­ల­తో కమి­ష­న్‌ తుది ని­వే­దిక సమ­ర్పిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. కా­ళే­శ్వ­రం ఆన­క­ట్ట­ల­కు సం­బం­ధిం­చి అవ­క­త­వ­క­ల­పై వి­చా­ర­ణ­కు తె­లం­గాణ ప్ర­భు­త్వం కమి­ష­న్ ఏర్పా­టు చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. సు­మా­రు 15 నె­ల­ల­పా­టు వి­చా­రణ జరి­పి తుది ని­వే­ది­క­ను రూ­పొం­దిం­చిం­ది. ఈ ని­వే­ది­క­ను ఇరి­గే­ష­న్ శాఖ ప్రి­న్సి­ప­ల్ సె­క్రె­ట­రీ రా­హు­ల్ బొ­జ్జ, సీ­ఎ­స్‌­కు అం­ద­జే­స్తా­ర­ని సమా­చా­రం. మొ­త్తం 115 మం­ది­ని వి­చా­రిం­చి సా­క్ష్యా­ల­ను నమో­దు చే­సిం­ది. వి­చా­ర­ణ­కు సం­బం­ధిం­చిన తుది ని­వే­ది­క­ను సి­ద్ధం చేసి తా­జా­గా ప్ర­భు­త్వా­ని­కి అం­ద­జే­సిం­ది. క్రా­స్‌ ఎగ్జా­మి­నే­ష­న్, వి­జి­లె­న్స్, ఎన్డీ­ఎ­స్‌ఏ ని­వే­ది­క­ల­ను కూడా పరి­శీ­లిం­చిం­ది. వి­చా­ర­ణ­కు చాలా సమయం పట్ట­డం­తో… పలు­మా­ర్లు కమి­ష­న్ గడు­వు కూడా పొ­డి­గిం­చా­రు. తుది ని­వే­ది­క­లో ఎలాం­టి అం­శా­ల­ను ప్ర­స్తా­విం­చా­రు..? లో­పా­లు ఎక్క­డు­న్నా­యి…? వీ­టి­కి ఎవరు బా­ధ్యు­లు వంటి పలు ప్ర­శ్న­ల­పై కమి­ష­న్ ఎలాం­టి ని­వే­దిక ఇచ్చిం­ద­నే­ది ఉత్కం­ఠ­గా మా­రిం­ది. ప్ర­భు­త్వా­ని­కి ని­వే­దిక చే­ర­టం­తో దీ­ని­పై కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఏం చే­య­బో­తుం­ద­నే­ది కూడా ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది.

Tags:    

Similar News