కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

ఇండొనేషియాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కలిమంతన్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు తారకన్‌ పట్టణంలోని జుటా పెర్మాయ్‌

Update: 2020-09-28 08:10 GMT

ఇండొనేషియాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కలిమంతన్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు తారకన్‌ పట్టణంలోని జుటా పెర్మాయ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మరణించారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఈ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే, చాలా మంది గాయాలపాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News