Pakistan: పాకిస్తాన్ లో జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

కరాచీ మాలిర్ జైలులో ఘటన..;

Update: 2025-06-03 03:15 GMT

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని ఖైదీలు పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్‌ అని సమాచారం. పరారైన ఖైదీల కోసం పోలీసుల వేట మొదలుపెట్టారు. కరాచీలో ఎమర్జెన్సీ, పౌరులంతా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరాచీలో భూకంపం సంభవించింది. ఈక్రమంలో ఖైదీలను బ్యారక్‌ నుంచి గ్రౌండ్‌లోకి తీసుకొస్తుండగా పారిపోయారు. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి. సాధారణ ప్రజలు జైలు పరిసరాల నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

దాదాపుగా 200 మంది వరకు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం. అయితే, వీరిలో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల దాడిలో గాయపడిన ఒక పోలీస్ పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాల దృష్ట్యా జైలుకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయారు. జైలు డిఐజి హసన్ సెహ్టో తరువాత మీడియాతో మాట్లాడుతూ, జైలు మొత్తాన్ని సీల్ చేశామని, కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు తెలిపారు. మరోవైపు, పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సి సిబ్బంది ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News