Russia attack : 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా…
రష్యా దాడులను తిప్పికొట్టినట్లు ప్రకటించిన ఉక్రెయిన్..;
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనే రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ చేయనంత భారీ స్థాయిలో ఉక్రెయిన్ (Ukraine) పై వైమానిక దాడులు (Air strikes) చేసింది.
గత రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. వాటిలో 249 డ్రోన్లను కూల్చేశామని, మరో 226 డ్రోన్లు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలవల్ల వాటంతటవే కూలిపోయాయని తెలిపింది. ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ మాట్లాడుతూ.. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని తెలిపారు.
ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు ఇహ్నాట్ చెప్పారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. ఖెర్సాన్ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. కాగా రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తీవ్రస్థాయిలో జరిగిన దాడి తర్వాత ఇరు దేశాల మధ్య మూడేళ్ల యుద్ధ ముగింపు ప్రయత్నాల ఆశల్ని దెబ్బతీసింది. బాంబు దాడుల వల్ల ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ మూడవ ఎఫ్-16 ఫైటర్ జెట్ని కోల్పోయినట్లు జెలెన్స్కీ చెప్పారు. భారీ దాడులు చేయగలిగతే సామర్థ్యం ఉన్నంత వరకు రష్యా ఆగదని ఆయన అన్నారు. గత వారంలో 114కి పైగా క్షిపణులు, 1270కి పైగా డ్రోన్లు, 1100 గ్లైడ్ బాంబులను ప్రయోగించినట్లు ఆరోపించారు. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, యుద్ధం చేయాలని పుతిన్ భావిస్తున్నాడని జెలెన్స్కీ అన్నారు.
డ్రోన్లు, వివిధ రకాల క్షిపణులను పరిగణనలోకి తీసుకుంటే దేశంపై “అత్యంత భారీ వైమానిక దాడి” అని ఉక్రెయిన్ వైమానిక దళం కమ్యూనికేషన్స్ అధిపతి యూరి ఇహ్నాత్ అసోసియేటెడ్ ప్రెస్తో అన్నారు.దాడి సమయంలో డ్రోన్లు, బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులు సహా దాదాపు 500 రకాల వైమానిక ఆయుధాలను ఉపయోగించినట్లు ఉక్రేనియన్ సైన్యం తెలిపింది.