Death Penalty : భారత నౌకాదళ సిబ్బందికి మరణశిక్ష
8 మంది భారత నేవీ మాజీ అధికారులపై గూఢచర్యం ఆరోపణలు;
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న వీరిపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ఖతార్ అధికారులు వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరికి మరణశిక్ష విధిస్తూ ‘కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఖతార్’ గురువారం తీర్పు వెలువరించింది. దీనిపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటామని, అన్ని మార్గాల్ని వినియోగిస్తామని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.
కాగా కోర్టు తీర్పు తమను షాక్ గురి చేసిందని, మాజీ నేవీ ఉద్యోగుల కుటుంబసభ్యులతో పాటు వారి లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగమంత్రిత్వశాఖ (ఎంఈఏ) పేర్కొంది. చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వినియోగించుకుంటామని ఎంఈఏ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోందని.. శిక్షపడిన మాజీ నేవీ అధికారులకు ఇండియా తరపున కావాల్సిన లీగల్ అసిస్టెన్స్ ఇస్తామని తెలిపింది. భారతీయు అధికారులు ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడి పరిస్థితిని వారికి వివరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.ఇక ఈ కేసు విషయానికి వస్తే ఇండియాకు చెందిన నేవీ అధికారులు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన కంపెనీలపై అవినీతి , గూఢచర్యం కేసు మోపబడింది. కాగా ఈ కేసు 2012లో వెలుగు చూసింది.
ఇక కేసు పూర్వాపరాల విషయానికి వస్తే అల్ దహురా కంపెనీ ఎనిమిది మంది సీనియర్ నేవీ అధికారులు లంచం ఇచ్చి ఇండియన్ ఆర్మీకి సంబందించిన కీలక సమాచారం అందించాలని కోరిందనేది ప్రధాన ఆరోపణలు. కాగా ఈ ఎనిమిది మంది నెవీ అధికారులను గూఢచర్యం అవినీతి కేసుపై అరెస్టు చేశారు. 2016 నుంచి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో బ్రిగేడియర్ కుల్వీందర్సింగ్కు పది సంవత్సరాల జైలు శిక్ష పడగా, మిగిలిన అధికారులకు 3-7 సంవత్సరాల శిక్ష విధించింది కోర్టు.
తమ వాళ్లను ఖతార్ ప్రభుత్వం నిర్బంధించటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాని మోదీకి గత ఏడాది లేఖ కూడా రాశారు. ఈ కేసులో తమ సోదరుడిని విడిపించేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలంటూ ఓ యువతి ప్రధాని మోదీని వేడుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్లను ట్యాగ్ చేస్తూ, ‘దేశ గౌరవాన్ని పెంచిన నేవీ మాజీ అధికారుల్ని తిరిగి భారత్కు రప్పించాలి. ప్రధాని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.