తాలిబన్ల కంటే ప్రమాదకారులు.. మేం చేసింది సరైందే: బైడెన్
తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు పొంచి ఉన్నాయని వాటి నుంచి కాపాడుకునేందుకుే ఆఫ్గన్ నుంచి వైదొలగామని;
అగ్ర రాజ్యం అమెరికా అఫ్గన్లో తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం సరైనదే అని సమర్థించుకుంటున్నారు. అదను కోసమే చూస్తున్న తాలిబన్లు ఆఘమేఘాల మీద ఆక్రమించేసుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్లతో సహా, ఇతర దేశాలలో అల్-ఖైదా మరియు దాని అనుబంధ సమూహాల నుండి తమకు ఎక్కువ ముప్పు ఉందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. అమెరికా సైనిక శక్తిపై దృష్టి పెట్టడం ఇకపై "హేతుబద్ధమైనది" కాదని బైడెన్ చెప్పారు. "ముప్పు ఎక్కడ ఉదంనేదానిపై ముందు మేము దృష్టి పెట్టాలి" అని బిడెన్ గురువారం ఇంటర్వ్యూలో చెప్పారు.
గత వారాంతంలో తాలిబాన్లు దేశాన్ని పూర్తిగా నియంత్రించిన తరువాత 15,000 మంది అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. అదే ఇంటర్వ్యూలో బిడెన్ మాట్లాడుతూ, ప్రతి అమెరికన్ ఖాళీ చేయబడే వరకు ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ సైనికులను ఉంచడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.
శనివారం నుంచి దాదాపు 6,000 మందిని అమెరికా మిలిటరీ తరలించిందని వైట్ హౌస్ అధికారి ఒకరు బుధవారం రాత్రి చెప్పారు. తాలిబన్ల అరాచక పాలనకు భయపడి తలో దిక్కుకు పారిపోయారు ఆఫ్గన్లు. తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు పొంచి ఉన్నాయని వాటి నుంచి కాపాడుకునేందుకుే ఆఫ్గన్ నుంచి వైదొలగామని అధ్యక్షుడు బైడెన్ సమర్థించుకుంటున్నారు. సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్ఖైదా, ఐసిస్లు ప్రాబల్యం పెంచుకున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
అమెరికాకు వలస వచ్చిన ఆఫ్గన్ల సంఖ్య ఇప్పటికే 20 వేలకు చేరుకుంది. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఆఫ్గన్లోని అమెరికా సేనలకు దుబాసీలుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అగ్రరాజ్యం కసరత్తు చేస్తుంది.
తాలిబన్లు ఆఫ్గన్ను హస్తగతం చేసుకోవడంతో అమెరికా ఆ దేశానికి ఆయుధాలు అమ్మకూడదని నిర్ణయించింది. ఈ మేరకు నిషేధం విధిస్తూ బైడెన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండు రోజుల్లో తమ సైన్యంతో కలిసి పని చేసిన ఐదుగురు అప్ఘాన్ అనువాదకులను తాలిబన్లు చంపేశారని అమెరికా ప్రతినిధి ఒకరు తెలిపారు.