Imran Khan : ఇమ్రాన్ఖాన్కు భారీ ఊరట..
తోషాఖానా కేసులో 14 ఏండ్ల జైలు శిక్ష రద్దు;
తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఇమ్రాన్కు, ఆయన భార్య బుస్రా బీబీకి విధించిన 14 ఏండ్ల జైలు శిక్షను హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ దంపతులిద్దరికీ ఈ ఏడాది జనవరి 31న 14 ఏండ్ల చొప్పున జైలు శిక్ష విధించడంతో వారు శిక్ష అనుభవిస్తున్నారు. తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమీర్ ఫరూక్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం వారికి తాత్కాలిక ఊరట కలిగించింది.
వారిద్దరికీ విధించిన శిక్షను రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే శిక్షకు వ్యతిరేకంగా వారు దాఖలు చేసిన పిటిషన్లను ఈద్ పండుగ తర్వాత వచ్చే నెల విచారిస్తామని తెలిపింది. కాగా, శిక్ష రద్దు చేసినా ఇమ్రాన్ దంపతులిద్దరూ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇమ్రాన్, బుస్రా కూడా వేరే కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు
వివిధ కేసుల ఊబిలో చిక్కుకొని జైలులో మగ్గుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఊరట లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషా ఖానా)లోని బహుమతులను అక్రమంగా అమ్ముకున్న వ్యవహారంలో గతంలో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. అయితే దీనిపై పునర్విచారణ కోరుతూ ఇమ్రాన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో గతంలో దిగువ కోర్టు ఇమ్రాన్కు విధించిన 14 ఏళ్ల శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. రంజాన్ పండుగ సెలవుల తర్వాత పిటిషన్పై విచారణ జరిపి, సాక్ష్యాధారాలను తిరిగి పరిశీలించి తుది తీర్పును వెలువరించే వరకు ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ దంపతులకు పడిన శిక్షను నిలిపివేస్తున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 8 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దానికి సరిగ్గా వారం రోజుల ముందు.. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు జైలు శిక్ష పడింది. 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ పదవిని కూడా చేపట్టకుండా ఇమ్రాన్ ఖాన్పై అనర్హత వేటు వేసింది. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ ఖజానాలోని విదేశీ బహుమతులను విక్రయించారనే ఆరోపణలపై విచారణ జరిపిన దిగువ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.