Jesse Jackson :అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ కన్నుమూత
USAలో పౌర హక్కుల పోరాటానికి చిహ్నం
ప్రముఖ పౌర హక్కుల నేత, డెమోక్రాటిక్ అధ్యక్ష నామినేషన్ కోసం రెండుసార్లు పోటీ పడిన జెస్సీ జాక్సన్ మంగళవారం మృతి చెందారు. జెస్సీ జాక్సన్(84) నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికాలో జాతి వివక్షపై ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సన్నిహిత సహచరునిగా పేరొందారు. ఆయన 2017 నుంచి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. 1984, 1988లో ఆయన డెమోక్రాటిక్ అధ్యక్ష నామినేషన్ కోసం పోటీపడ్డారు. షికాగోకు చెందిన ఆయన పౌర హక్కుల సంఘాలైన ఆపరేషన్ పుష్, నేషనల్ రెయిన్బో కూటమిని స్థాపించారు.
అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి విశేష సేవలు అందించిన ప్రముఖ నాయకుడు రెవరెండ్ జెస్సీ జాక్సన్ . సామాజిక సమానత్వం, జాతి వివక్ష నిర్మూలన, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఆయన దశాబ్దాలుగా పోరాటం సాగించారు.
1941లో జన్మించిన జెస్సీ జాక్సన్, ప్రముఖ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తో కలిసి పౌరహక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం ఆయన “రెయిన్బో పుష్ కోలిషన్” సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేపట్టారు.
1984 మరియు 1988 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. జాతి, వర్గ భేదాలను అధిగమించి సమాన అవకాశాలు కల్పించాలని ఆయన ఎప్పటికప్పుడు పిలుపునిచ్చారు.