India-US: భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా

ప్రత్యేక సందేశాన్ని పంపించిన మార్కో రూబియో

Update: 2026-01-26 03:15 GMT

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు అమెరికా ప్రత్యేక సందేశాన్ని పంపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ, ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో అమెరికా-భారతదేశం లోతైన, బహుముఖ సహకారన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చినందుకు జరుపుకుంటున్న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు అని చెప్పారు.

‘‘అమెరికా ప్రజల తరపున.. మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘‘యునైటెడ్ స్టేట్స్-భారతదేశం చారిత్రాత్మక సంబంధాన్ని పంచుకుంటున్నాయి. రక్షణ, శక్తి, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక సహకారం. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని రూబియో పేర్కొన్నారు. అమెరికా-భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధం వివిధ రంగాల్లో సన్నిహిత సహకారం ద్వారా నిజమైన ఫలితాలను ఇస్తుందని ఆకాంక్షించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం ఉంటుందని వెల్లడించారు.

భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గ్రాండ్ కవాతు జరగనుంది. ఈ వేడుకలకు అతిథులుగా యూరోపియన్ నాయకులు హాజరుకానున్నారు. ప్రస్తుతం భారతదేశం-యూరోపియన్ దేశాలతో సంబంధాలు బలపడుతున్నాయి.

Tags:    

Similar News