మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఇకలేరు..

X
By - Subba Reddy |29 Jan 2023 11:00 AM IST
అనారోగ్యంతో బాధపడుతూ వట్టి కన్ను మూశారు
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వట్టి వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా.
ఉంగుటూరు శాసనసభ సభ్యుడిగా వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రోశయ్య కేబినెట్లోనూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వట్టి కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటకశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com