పోలవరంపై తెలంగాణ డిమాండ్.. ఏపీ అంగీకారం

X
By - Subba Reddy |11 Feb 2023 11:00 AM IST
పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాలపై ఉమ్మడి సర్వేకు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు నీటిమట్టంపై ఉమ్మడి సర్వే చేయాలన్న తెలంగాణ డిమాండ్కు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర జల సంఘం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రభావాలపై ఉమ్మడి సర్వే చేయాలని తెలంగాణ కోరుతోంది. సర్వే తరవాత తగిన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటాయని జలసంఘం వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ అంశంపై కేంద్ర జలసంఘం జనవరి 25న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలతోపాటు పోలవరం అథార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం చేయిస్తామని జలసంఘం తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com