పుంగనూరులో అధికారులు అత్యుత్సాహం

X
By - Subba Reddy |11 Feb 2023 2:30 PM IST
వాకింగ్ ట్రాక్ కోసం ఇళ్లు కూల్చివేత
చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పునరావాసం కల్పించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఉన్నట్టుండి అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను, తమ బిడ్డల్ని చెరువులో పడేసి రోడ్లు వేసుకోమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పుంగనూరులో వాకింగ్ ట్రాక్ కోసం చెరువు చుట్టూ రోడ్డు నిర్మాణం చేపట్టారు అధికారులు. అయితే వాకింగ్ ట్రాక్ కోసం ఇళ్లను కూల్చేయడమేంటని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కాగా ఇప్పటికే రోడ్డు నిర్మాణంలో ఎన్ఎస్ పేటలో 15 ఇళ్లను అధికారులు కూల్చనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com