బారాషహీద్ వద్ద హత్యాయత్నం.. ఛేదించిన పోలీసులు

బారాషహీద్ వద్ద హత్యాయత్నం.. ఛేదించిన పోలీసులు
నిన్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్ అనుచరుడు సమీర్‌పై కత్తులతో దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేశారు

నెల్లూరు బారాషహీద్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్ అనుచరుడు సమీర్‌పై కత్తులతో దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. సారాయి అంగడి సెంటర్ వద్ద ముగ్గురిని పట్టుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు సమీపై రౌడీషీట్‌ ఓపెన్ చేశారు. వ్యక్తిగత తగాదాల వల్లే సమీర్‌పై సమీ వర్గం అటాక్ చేసిందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులే కారణమని తెలిపారు. సమీర్ కుటుంబసభ్యులను కించపరిచేలా సమీ వీడియోలు పెట్టారని చెప్పారు. ఈ ఘటనలో రాజకీయ కోణం గానీ, వ్యక్తుల ప్రమేయం గానీ లేదని ఇద్దరి వ్యక్తుల మధ్య తలెత్తిన విభేదాలే దాడికి దారి తీశాయని డీఎస్పీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story