మదనపల్లికి చేరుకున్న లోకేష్ యువగళం

మదనపల్లికి చేరుకున్న లోకేష్ యువగళం
నాలుగు రోజుల పాటు పీలేరు నియోజకవర్గంలో కొనసాగిన యువగళం పాదయాత్ర నిన్న మదనపల్లి నియోజకవర్గంలోకి ఎంట్రీ

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 39వ రోజు చేరుకుంది. యువ నేతకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ఇప్పటి వరకు 497 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు పీలేరు నియోజకవర్గంలో కొనసాగిన యువగళం పాదయాత్ర నిన్న మదనపల్లి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక పాదయాత్రలో అన్ని వర్గాలతో మమేకం అవుతూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఎవరు అధైర్య పడొద్దని రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని.. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీలు ఇస్తున్నారు.

ఉదయం 8గంటలకు మదనపల్లి నియోజకవర్గం పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా పాల ఏకిరి సామాజికవర్గం ప్రతినిధులు తమ సమస్యలపై లోకేష్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. 8.10నిమిషాలకు పూలవాండ్లపల్లిలో బోయ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 8.40 నిమిషాలకు మదనపల్లి రూరల్ సిటిఎం-1 పంచాయితీ స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. 8.55 నిమిషాలకు సిటిఎం-1 క్రాస్ రోడ్డులో స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు. 9.15 నిమిషాలకు సిటిఎం-2 పంచాయితీలో పాదయాత్రలో 500 కిలోమీటర్ల మైలురాయిన పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.

9.40నిమిషాలకు యువనేతకు పార్టీ సీనియర్ నేతల ఆశీర్వచనం ఇవ్వనున్నారు.10.20నిమిషాలకు సీటీఎం లేక్ వద్ద స్థానికులతో సమావేశం అవుతారు.11 గంటలకు కొత్తవారిపల్లి వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు.

11.40నిమిషాలకు ఎనుమువారిపల్లిలో చేనేతలతో సమావేశం అవుతారు. 12.40నిమిషాలకు ఎనుములవారిపల్లిలోనే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.40నిమిషాలకు ఎనుములవారిపల్లి భోజన విరామ స్థలంలో ముస్లింలతో ముఖాముఖిలో పాల్గొంటారు.సాయంత్రం. 3.40 నిమిషాలకు మెడికల్ కళాశాల నిర్మాణ ప్రాంతంలో యువతతో భేటీ అవుతారు. 4.20 నిమిషాలకు తురకపల్లి స్థానికులతో మీట్ కానున్నారు. 4.45 నిమిషాలకు వెంకటప్పకొండలో టిడ్కో గృహాల బాధిత లబ్ధిదారులతో, 5.25 నిమిషాలకు తట్టివారిపల్లి వెంగమాంబ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. ఇక 6.20 నిమిషాలకు తట్టివారిపల్లి దేవతానగర్ లో లోకేష్‌ ఆధ్వర్యంలో చేరికలు ఉండనున్నాయి. సాయంత్రం 6.30 నిమిషాలకు తట్టివారిపల్లి దేవతానగర్ విడిది కేంద్రం వద్ద 39వ రోజు పాదయాత్ర ముగియనుంది. రాత్రికి లోకేష్ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story