కోడికత్తి కేసులో సీఎం కోర్టుకు హాజరు కావాల్సిందే

X
By - Subba Reddy |14 March 2023 6:30 PM IST
వచ్చే నెల 10వ తారీకున సీఎం హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు
కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ విచారణకు హాజరు కావాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. వచ్చే నెల 10వ తారీకున సీఎం హాజరు కావాలని పేర్కొంది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర్రెడ్డిని కూడా హాజరు కావాలని ఆదేశించింది. దాడి చేసేటప్పుడు నిందితుడు శ్రీనివాసరావు చేతిలో కోడికత్తి చూడలేదని సాక్షి దినేష్ కుమార్ వెల్లడించాడు. దీంతో సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు కూడా సీఎం జగన్ హాజరు కావడంలేదు. ఈ క్రమంలో కోడికత్తి కేసుకు జగన్ హాజరౌతాడా లేదా అని సందిగ్ధత ఏర్పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com