దొంగ ఓట్లతోనే గెలిచా: ఎమ్మెల్యే రాపాక

X
By - Subba Reddy |27 March 2023 1:00 PM IST
నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేశారు
ఆత్మీయ సమ్మేళనంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సెల్ఫ్ గోల్ అయ్యారు. సమ్మేళనంలో ప్రసంగించిన ఎమ్మెల్యే అత్యుత్సాహానికి పోయి తనను తాను ప్రమాదంలోకి నెట్టుకున్నారు. చింతలమోరులో తనకు పడిన దొంగ ఓట్ల గురించి రాపాక వెల్లడించారు. నేను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు. అందుకే ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ వచ్చిందని తెలిపారు. తాను అప్పటి నుంచి దొంగ ఓట్లతో గెలుస్తున్నానని రాపాక చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేశారని స్టేజీపైనే తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com