దిక్కు తోచని స్థితిలో ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన రైతులు
By - Subba Reddy |28 March 2023 7:15 AM GMT
జగనన్న హౌసింగ్ కాలనీలకోసం జరిపిన ల్యాండ్ పూలింగ్, న్యాయం చేయాలని బాధిత రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన
జగనన్న హౌసింగ్ కాలనీలకోసం జరిపిన ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన రైతులకు దిక్కుతోచడం లేదు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం నుంచి సేకరించిన వందలాది ఎకరాల D-పట్టా భూములకు అధికారులు పరిహారంగా భూమి చూపించడంలేదు. అయితే దీని వెనుక స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి ఉన్నారన్న ఆరోపణ వినిపిస్తోంది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమను మోసం చేసి అక్రమంగా ప్లాట్లు పొందిన ZPTC గిరిబాబు, అతని బినామీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com