మగాళ్లు పోరంబోకులు: మంత్రి ధర్మాన

మగాళ్లు పోరంబోకులు: మంత్రి ధర్మాన
ఇంట్లో ఉన్న మగాళ్లే అసలు విలన్లని, తిని ఊరిపై పడిపోతారన్నారు

మగవాళ్లు పోరంబోకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాద్‌. శ్రీకాకుళంలో ప్రసంగించిన ఆయన ఇంట్లో ఉన్న మగాళ్లే అసలు విలన్లని, తిని ఊరిపై పడిపోతారన్నారు. ఇంట్లో, బయట మహిళలే పని చేయాలని పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదన్నారు . అందుకే ఇల్లాలికి ప్రభుత్వం అధికారమిచ్చిందన్నారు. జగన్‌ను ఎన్నుకోకపోతే మహిళలకు 3 వేలు రావన్నారు. అధికారం అనే కీ జగన్‌ వద్ద ఉండటం వల్లే సంపదను మహిళల చేతుల్లో పెట్టారన్నారు. అధికారం లేకపోతే జగన్‌ పథకాలు ఇవ్వలేరన్నారు మంత్రి ధర్మాన.

Tags

Read MoreRead Less
Next Story