నేడు మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు

నేడు మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన గిరిజన సంఘాలు
బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా నిరసన

బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో బంద్‌ నిర్వహించాలని వివిధ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ర్యాలీ చేపట్టారు. ఎటపాక, మేడువాయి, లక్ష్మీపురం, రాయనపేట, చోడవరం, గుండాల, నెల్లిపాక, తోటపల్లి, నల్లకుంట, బాసవాగు మీదుగా మురుమూరు వరకు ర్యాలీ జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story