వైసీపీ ఎమ్మెల్సీకి షాకింగ్‌ అనుభవం

వైసీపీ ఎమ్మెల్సీకి షాకింగ్‌ అనుభవం
X

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణకు వినూత్న అనుభవం ఎదురైంది. ఆయన స్వామివారి దర్శనానికి రాగా.. అదే సమయంలో అమరావతి రైతులు కూడా వచ్చారు. ఈ క్రమంలో వెంకటరమణ అమరావతి రైతులను పలకరించారు. అయితే.. అమరావతిని రాజధానిగా ఉండేలా చూడాలని రైతులు అభ్యర్థించారు. తాను కూడా మొన్నటి వరకు పోరాటంలోనే ఉన్నానని వెంకటరమణ వివరించారు. ఇంతలో ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు కవర్‌ చేస్తుండగా ఆయన అవాక్కయ్యారు. ఆ వీడియో డిలీట్‌ చేయాలని కోరారు.

Tags

Next Story