పది విద్యార్థులకు అండగా టీఎన్ఎస్ఎఫ్
By - Subba Reddy |1 April 2023 2:00 PM GMT
పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సొంత వాహనాలు లేని విద్యార్థులకు సాయం
సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఎన్ఎస్ఎఫ్ కీలక నిర్ణయం తీకుంది. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సొంత వాహనాలు లేని విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలాంటి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తామే తరలిస్తామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో టీఎన్ఎస్ఎఫ్ వాహనాలు ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com