అరసవల్లికి చేరుకున్న అమరావతి రైతుల రథయాత్ర

X
By - Subba Reddy |2 April 2023 8:45 AM IST
సూర్యభగవానుడ్ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు అమరావతి రైతులు
అమరావతి నుంచి రాజధాని రైతులు చేపట్టిన రథయాత్ర అరసవల్లికి చేరుకుంది. శ్రీ సూర్యభగవానుడ్ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు అమరావతి రైతులు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ.. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎదుట నినాదాలు చేశారు. ఏకైక రాజధాని అమరావతే' లక్ష్యంగా గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీన అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల గతేడాది అక్టోబర్ 23న యాత్ర నిలిచిపోయింది. తాజాగా శుక్రవారం రథ యాత్ర పున:ప్రారంభమైంది. శనివారం రాత్రి అరసవల్లికి రథం చేరుకుంది. ఇవాళ ఉదయం.. సూర్యభగవాడిని దర్శించుకున్నారు అమరావతి రైతులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com