మంత్రి బుగ్గన పీఏలమంటూ దౌర్జన్యం

X
By - Subba Reddy |6 April 2023 11:45 AM IST
ఆళ్లగడ్డకు చెందిన పుల్లారెడ్డి, అతని వర్గీయులు హల్చల్
నంద్యాలలో మంత్రి బుగ్గన పిఏ పేరుతో దౌర్జన్యం చేస్తున్నారు కొందరు దుండగులు. ఆళ్లగడ్డకు చెందిన పుల్లారెడ్డి, అతని వర్గీయులు హల్చల్ చేశారు. స్థానిక సాయిబాబా నగర్ లో నివాసముంటున్న గోపాలకృష్ణ,లక్ష్మీదేవి దంపతుల ఇంటి తాళాలు ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి ఇంట్లో ఉన్న 70వేల నగదుతో పాటు,నగలు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దుండగుల పరార్ అయ్యారు.మంత్రి బుగ్గన పిఏ బంధువుల నుంచి ప్రాణహాని ఉందంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com