AP : వైసీపీ సర్కార్పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఫైర్

X
By - Vijayanand |13 April 2023 3:35 PM IST
వైసీపీ సర్కార్పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఫైరయ్యారు. విశాఖలో బెదిరింపులకు పాల్పడుతూ విలువైన స్థలాలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్ అవసరాల కోసం ఇచ్చిన భూముల్లో లే అవుట్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రామానాయుడు స్టూడియోకి 54 ఎకరాల స్థలాన్ని ఇచ్చామని.. గతంలో దీన్ని వైఎస్ఆర్ అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. అయితే అప్పుడు కుదరలేదని ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 17 ఎకరాలు జీవీఎంసీ కమిషనర్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com