AP : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు
![AP : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు AP : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://www.tv5news.in/h-upload/2023/04/14/944722-84568.webp)
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి,రాజశేఖర్ రెడ్డి రాజ్యంగం ఎప్పుడో పోయిందని,ప్రస్తుతం భారతీరెడ్డి రాజ్యంగం నడుస్తోందని అన్నారు. సానుభూతి కోసమే కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి హత్యా జరిగాయన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు మరో ఇద్దరి హత్య జరిగే అవకాశం ఉందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే వివేకా హత్య, వైజాగ్ లో కోడికత్తితో దాడి డ్రామా వంటివి జరిగాయని ఆరోపించారు. జగన్ పై కోడికత్తితో దాడి వెనుక కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపిందని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎంత మంది అధికారులను మార్చినా ఒరిగేది లేదని... నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com