గుంటూరులో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం
By - Vijayanand |18 April 2023 11:46 AM GMT
వైసీపీ మహిళా కార్పొరేటర్ వేధింపులతో గుంటూరులో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.కొన్ని రోజుల క్రిందట 45వ డివిజన్లో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, కార్పొరేటర్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అనడంతో కార్పొరేటర్ స్వీపర్ విధుల నుంచి తప్పించారు. అయితే తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే, కార్పొరేటర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినప్పటికీ వారు కనికరించకపోవడంతో వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై నిద్ర, బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com