ఎంపీ అవినాష్‌ వాఖ్యలపై మండిపడ్డ ఫారుఖ్‌ షిబ్లి

ఎంపీ అవినాష్‌ వాఖ్యలపై మండిపడ్డ ఫారుఖ్‌ షిబ్లి
ముస్లిం మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజారుకు ఈడ్చేలా అవినాష్‌రెడ్డి మాట్లాడటం దుర్మార్గమన్నారు

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ. ముస్లిం మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజారుకు ఈడ్చేలా అవినాష్‌రెడ్డి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం ఆవేదన కలిగించిందన్నారు. ఈ రాష్ట్రంలో విశ్వసనీయత, పరువు, మర్యాదలు వైఎస్‌ కుటుంబానికి మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారు.

అవినాష్‌ హత్యపై మాట్లాడకుండా..వివేకానందరెడ్డి అక్బర్‌బాషాగా మారారు. వీరికి షేక్‌ షాహిన్‌షా అనే కుమారుడున్నాడు. వారిని విచారించాలని అవినాష్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. గతంలో టీడీపీ కుట్ర అని, నారాసుర రక్తచరిత్ర అని ఆరోపించింది మర్చిపోయారా?అంటూ ప్రశ్నించారు. ‘నమ్మకానికీ, విశ్వసనీయతకు ముస్లిం సమాజం మారుపేరుగా నిలుస్తుందని. కోడి కత్తి కేసులో నిందితుడైన దళిత యువకుడు శ్రీనివాసరావును కాపాడేందుకు మా సమితి లీగల్‌ టీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ సలీం నాలుగేళ్లుగా నయా పైసా తీసుకోకుండా మానవతా దృక్పథంతో న్యాయవాదిగా సేవలందిస్తున్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story