విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రానికి చిత్తశుద్ది లేదు : రామకృష్ణ

X
By - Vijayanand |19 April 2023 5:14 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ.. ప్లాంట్పై కేంద్రం రెండు నాలుకల ధోరణి సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ను కేంద్రం అదానీ, పోస్కోకి అప్పగించే యోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇదే జరిగితే ఏపీ ప్రభుత్వం సూసైడ్ చేసుకున్నట్లేనన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం స్పందించేలా అందరూ కలిసి ఒత్తిడి తేవాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com