USA : దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడి మృతి
అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వెస్ట్ ఒహాయాలో జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి వీర సాయేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్, 1000 వెస్ట్బ్రాడ్ స్ట్రీట్లోని షెల్ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న సాయేశ్ దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
24 ఏళ్ళ సాయేశ్ వీర..మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 2021లో ఎంఎస్ చేయడానికి సాయేశ్ అమెరికా వెళ్లిన సాయేష్. మాస్టర్స్ చేస్తూ పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నారు. సాయేష్ మృతిలో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. సాయేష్కు తల్లి, అన్నయ్య ఉన్నారు. తండ్రి కొన్నేళ్ల కిందట చనిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com