AP : మన్యం జిల్లాలో ఏనుగుల హల్చల్

X
By - Vijayanand |21 April 2023 3:11 PM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల హల్చల్ చేశాయి. కొమరాడ మండలం బందవలసలో విధ్వంసం సృష్టించాయి. శ్రీనివాసరావు అనే రైతుల ఆయిల్ ఫామ్ తోటలోకి ప్రవేశించిన ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. అక్కడే ఉన్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు ఆవులు మృతి చెందాయి. మరోవైపు తోటలో పార్క్ చేసిన కారును పూర్తిగా ధ్వంసం చేశాయి. తోటలోని మోటార్లతో పాటు పైప్లను సైతం ధ్వంసం చేశాయి ఏనుగులు. మరోవైపు ఏనుగుల సంచారంతో స్థానిక ప్రజలు భయంభయంగా జీవనం సాగిస్తున్నారు. ఏ క్షణాన తమపై దాడి చేస్తాయోనని వణికిపోతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగుల దాడి నుంచి తమను రక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com