శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్ చల్
![శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్ చల్ శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్ చల్](https://www.tv5news.in/h-upload/2023/04/23/951546-86546.webp)
By - Vijayanand |23 April 2023 12:45 PM GMT
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, కీసరలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. పోలాల్లో మొక్కజోన్న, చిక్కుడు, చెరకు పంటలను నాశనం చేస్తున్నాయి. అటువైపుగా వెళ్లిన రైతులపైనా దాడి చేస్తున్నాయి. వ్యవసాయ పొలాల్లో వేసిన సోలార్ పంపుసెట్లను పూర్తిగా ధ్వంసం చేసేసాయి. చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేస్తుంటే ఏమీ చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అటవీశాఖా అధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ స్పందించలేదు. దాంతో ఏనుగులు ఎప్పుడు తమపై దాడి చేస్తాయో అని స్థానిక గ్రామాల్లో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com