మహిళలపైనా కేసులు నమోదు చేసిన ఘనుడు డీఎస్పీ: జేసీ ప్రభాకర్
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వల్లే శాంతిభద్రతలు లోపిస్తున్నాయని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి డీఎస్పీ తొత్తుగా మారి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు. మహిళలపైనా కేసులు నమోదు చేసిన ఘనుడు డీఎస్పీ అని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేపట్టినా హౌస్ అరెస్టు అంటూ తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. గత రాత్రి కూడా తన ఇంటిలోకి వచ్చి తనను వేధించారని.. ఇకపై తన ఇంట్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. చేతికి ఏది దొరికితే దాంతోనే తిరగబడతామని తేల్చిచెప్పారు. ఉన్నతాథికారులు డీఎస్పీ చైతన్య అక్రమాలపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని జేసి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com