Vivek Murder Case : అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ వాయిదా

Vivek Murder Case : అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ వాయిదా

అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు వాదనలు వింటామని తెలిపింది. అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా..రేపు వాదనలు వింటామని ధర్మాసనం ప్రకటించింది.మరోవైపు పులివెందుల నుంచి కడపకు చేరుకున్నారు ఎంపీ అవినాశ్‌రెడ్డి కడపలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఆయన్ను వైసీపీ కార్యకర్తలు, నేతలు వచ్చి కలుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story