Yuvgalam : పాణ్యం నియోజకవర్గంలో లోకేష్‌ యువగళం

Yuvgalam : పాణ్యం నియోజకవర్గంలో లోకేష్‌ యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. పాణ్యం నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో పాణ్యం దద్దరిల్లింది.ఇవాళ 90వ రోజు పాదయాత్ర పెద్ద కొట్టాల నుంచి ప్రారంభం అయింది. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు పాణ్యం ప్రజలు. కే. మార్కాపురంలో కురుబ సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు లోకేష్‌.

పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు. ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరోవైపు ఎస్‌.గోకులపాడు క్రాస్‌ దగ్గర రైతులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అలాగే మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేష్. సల్కాపురంలో విద్యార్ధులు,యువతతో ప్రత్యేకంగా భేటి అయ్యారు.పెదపాడులో పాదయాత్రకు భోజన విరామం ఇవ్వనున్నారు. తిరిగి సాయంత్రం ప్రారంభం కానున్న పాదయాత్రలో పెదపాడు గ్రామస్తులతో సమావేశం కానున్నారు.తరువాత అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.ఇక రాత్రికి పెదపాడు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story