AP : మిర్చి రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

X
By - Vijayanand |5 May 2023 2:25 PM IST
ఇటీవల కురిసిన అకాల వర్షాలు మిర్చి రైతులను నిలువునా ముంచాయి. బజ్జి మిర్చి ధరలు పడిపోయి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చాయి. గిట్టుబాటు ధర లేదంటూ కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరు వారిపాలెంలో బజ్జి మిర్చిలను కృష్ణానదిలో పారబోసి నిరసన తెలిపారు. ఎకరాకు లక్షన్నర రూపాయలతో సాగు చేస్తే మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తా బజ్జి మిర్చికి 330 రూపాయలు ఉంటే మార్కెట్లో కేవలం రెండు వందలు మాత్రమే ఇస్తుంటే ప్రభుత్వం, అధికారులు, రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బజ్జి మిర్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com