వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదు: బొప్పరాజు

X
By - Subba Reddy |8 May 2023 6:15 PM IST
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కు వెల్లిన బొప్పరాజు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కు వెల్లిన బొప్పరాజు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇక మన్యం జిల్లాలో ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేకుండా సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇకజిల్లా విద్యాశాఖ అధికారి కృషి వల్లే పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మూడో దశ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టామని.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com