AP : జగన్ తీరుపై నిప్పులు చెరిగిన పరిటాల సునీత

AP : జగన్ తీరుపై నిప్పులు చెరిగిన పరిటాల సునీత

సీఎం జగన్ తీరుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పరిటాల సునీత. సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు అంతమంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో సి.బి.ఐ కు సహకరించకుండా డ్రామాలు నడుపుతున్నారని తెలిపారు. టిడిపి నేతలను అర్ధరాత్రి, తెల్లవారుజామున అరెస్టులు చేస్తారు కదా వారికి ఒక న్యాయం.. అవినాష్ రెడ్డికి ఇంకో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.

ఒక ఆడబిడ్డ.. తన తండ్రిని చంపిన వారిని చూపించినా శిక్షించలేకపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. విద్యుత్ కుంభకోణాలతో ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 57 వేల కోట్లు విద్యుత్ భారం ప్రజలపై మోపారని తెలిపారు. విద్యుత్ నిధులన్నీ తన బినామీ కంపెనీ అయిన షిరిడి సాయికి మళ్లించారని ఆరోపించారు సునిత. స్మార్ట్ మీటర్ల మాటున వేలకోట్ల దోపిడి చేస్తున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story