విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆందోళన

విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ  టీడీపీ ఆందోళన

ఏపీలో పెరిగిన కరెంట్ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. విజయనగరం జిల్లాలో ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద నిరసన చేపట్టారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచరాంటూ మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో 57 వేల కోట్లు దోచుకున్నారంటూ మండిపడ్డారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు, రైతుల మెడకు ఉరితాళ్లలా తయారయ్యాయంటూ మండిపడ్డారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేసారు.

Tags

Read MoreRead Less
Next Story