కోలుకుంటున్న ఎంపీ అవినాష్‌ తల్లి

కోలుకుంటున్న ఎంపీ అవినాష్‌ తల్లి
X

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ అవినాష్‌ తల్లి శ్రీలక్ష్మీ కోలుకుంటున్నారు.. ఆమె తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు.. మూడ్రోజుల్లో శ్రీలక్ష్మి ఆరోగ్యంలో గణనీయమైన పురోగతి వచ్చిందని వైద్యులు చెప్పారు.. వాంతులు తగ్గాయని, శ్వాస తీసుకోవడం మెరుగైందని వైద్యులు చెప్పారు.. అయోనోట్రోప్స్‌ను నిన్న నిలిపివేసినట్లు వెల్లడించారు.. త్వరలోనే అవినాష్‌ తల్లిని జనరల్‌ వార్డ్‌కు షిఫ్ట్‌ చేస్తామని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

తల్లి ఆరోగ్యం మెరుగుపడుతున్న నేపథ్యంలో అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతారా అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.. అటు సీబీఐ బృందాలు ఇంకా కర్నూలులోనే మకాం వేశాయి.. తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ దూకుడు పెంచే సూచనలు కనబడుతున్నాయి.. తల్లి ఆరోగ్యం బాగవడంతో అవినాష్‌ మనసు మార్చుకుంటారా.. సీబీఐ విచారణకు సహకరిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story