కారుణ్య నియామకాలు ఇవ్వాలి..ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

X
By - Subba Reddy |3 April 2023 12:45 PM IST
విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. అర్హత కలిగిన వారందరికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆర్టీసీ హౌస్ ముందు ధర్నాకు దిగారు. 2016 ముందు విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2016 తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చారని... తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బాటిల్స్ తమ వెంట తెచ్చుకున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు.. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com