పూజారి కాలితో తంతే మోక్షమట..! కర్నూలులో వింత ఆచారం

పూజారి కాలితో తంతే మోక్షమట..! కర్నూలులో వింత ఆచారం
పూజరితో తన్నించుకోవడం కోసం చిన్నా, పెద్దా తేడా లేకుండా పోటీ పడుతుంటారు

పూజారి కాలితో తంతే భక్తులకు మోక్షం కలుగుతుందట. పూజరితో తన్నించుకోవడం కోసం చిన్నా, పెద్దా తేడా లేకుండా పోటీ పడుతుంటారు. ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా చిన్నహోతురులో కొనసాగుతోంది. కాలితో తన్నించుకొన్న వారు మోక్షం పొందినట్టుగా భావిస్తుంటారు. గ్రామంలో ఉన్న సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో ఏటా ఏప్రిల్ నెలలో రథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శివపార్వతులకు ఆలయంలో వైభవంగా కల్యాణం జరిపిస్తారు. ఆ కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత.. ఈ తన్నుల తంతు ప్రారంభమవుతుంది.

భక్తులు ఆలయం ముందు వరుసలో భక్తులు నిలబడతారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద పెట్టుకొన్న ఆలయ పూజారి.. ఒక చేతితో త్రిషులం పట్టుకొని.. నాట్యం చేస్తూ గుడి నుంచి బయటికి పరుగెత్తుకుంటూ వస్తారు. నాట్యం చేస్తూనే భక్తుల్ని కాలితో తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇలా తన్నటం వల్ల తమకు మోక్షం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం .

సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన 500 వందల ఏళ్లకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో స్వామివార్ల విగ్రహాలతో పాటు ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసుకొన్నట్లు చెబుతున్నారు. ఉత్సవాల చివరి రోజున శివ పార్వతుల కళ్యాణంలో..... భక్తులు కొన్ని తప్పులు చేయటంతో.. ఆయన కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ వీరభద్ర స్వామే ఆలయ పూజారి రూపంలో.. ఇలా భక్తుల్ని భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దాదాపు 500 ఏళ్లకు ముందు నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని.. తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామంటున్నారు గ్రామస్థులు.

Tags

Read MoreRead Less
Next Story