By - Vijayanand |14 April 2023 12:02 PM GMT
వైసీపీ సర్కార్పై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రావణ్ కుమార్.. మహానీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గడప గడపకి దగా ప్రభుత్వం పుస్తకం ఆవిష్కరించిన శ్రావణ్ కుమార్... వైసీపీ ప్రభుత్వం దళితులకు, అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com