గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో రైతుల ఆందోళన

గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో రైతుల ఆందోళన

మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. రాజోలు ని యోజకవర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. మామిడికుదురు, రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వరి, మామిడి, మొ క్కజొన్నతోపాటు అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు గొల్లపల్లి సూర్యారావు. దీంతో వరికి ఎకరాకు 30వేలు... మామిడి, మొక్కజొన్నకు 50వేల నష్ట పరిహారం ఇవ్వాలంటూ డి మాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం కూడా గిట్టుబాటు ధరకు కొనడంతోపాటు వెంటనే డబ్బు చెల్లించాలన్నారు మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు. అదేవిధంగా పిడుగుపాటుకు మరణించిన కుటుంబాలకు 25లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Next Story